TS : రేవంత్ రివర్స్ గేర్.. థ్యాంక్స్ చెప్పిన మాదిగ సంఘాలు

TS : రేవంత్ రివర్స్ గేర్.. థ్యాంక్స్ చెప్పిన మాదిగ సంఘాలు

ఎమ్మార్పీఎస్ బీజేపీకి ఔట్ అంట్ ఔట్ సపోర్ట్ ప్రకటించింది. మరోవైపు.. మందకృష్ణ రేవంత్ రెడ్డి, కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో.. సీఎం, పీసీసీ చీఫ్ రివర్స్ గేర్ వేశారు. మాదిగలను మచ్చిక చేసుకునే చర్యలు తీసుకున్నారు.

మాదిగ సంఘాల ఫ్రంట్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మాదిగ కార్పొరేషన్ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారికి సీఎం భరోసా ఇచ్చారు.

ఇప్పటికే ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన ఆయన కాంగ్రెస్ సర్కార్‌పై తరచూ విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు. దీంతో... మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఆ సామాజిక సంఘాల నేతలు సీఎంను స్వయంగా కలిసి థాంక్స్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story