TS : టచ్ చేసి చూడండి మానవ బాంబులైతరు..శివాలెత్తిన రేవంత్

TS : టచ్ చేసి చూడండి మానవ బాంబులైతరు..శివాలెత్తిన రేవంత్

ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్న బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.దమ్ముంటే టచ్ చేసి చూడండి..మానవ బాంబులైతరంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వాన్ని ఎవరైనే టచ్ చేస్తే వాళ్ల అంతుచూస్తానన్నారు. పాలమూరు ప్రజాదీవెన సభలో మాట్లాడిన రేవంత్.. మోదీ పదేళ్లు, కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండొచ్చు కానీ.. పాలమూరు బిడ్డ సీఎం కుర్చీలో కూర్చోవద్దా అని ప్రశ్నించారు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడ్తారని ప్రశ్నించారు రేవంత్.

బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్,హరీశ్ లను చూస్తే బిల్లారంగాలు గుర్తొస్తరన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు కోసం బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. కుర్చేసుకుని.. కాదు కేసీఆర్ మందేసుకుని ఫామ్ హౌస్ లో పండుకున్నాడని మండిపడ్డారు. రోజా పెట్టిన చాపల పులుసు తిని కేసీఆర్ ఏపీకి నీళ్లు ధారాదత్తం చేశారని ఆరోపించారు రేవంత్.

రాష్ట్రానికి సహకరించకుంటే మోదీనైనా కేడీనైనా ఢీ కొడ్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి . పాలమూరులో రెండు ఎంపీ సీట్లను గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కృషి చేయాలన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పాలమూరు బిడ్డ బుర్గుల రామకృష్ణను సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story