TS : ఆర్టీసీ సంచలనం.. మధ్యాహ్నం వేళ ఆర్టీసీ బస్సుల తగ్గింపు

TS : ఆర్టీసీ సంచలనం.. మధ్యాహ్నం వేళ ఆర్టీసీ బస్సుల తగ్గింపు

తెలంగాణలో మండే ఎండల అలర్ట్ వచ్చింది. ఈ 2,3 రోజులు గట్టి ఎండలు ఉంటాయని వెదర్ డిపార్టుమెంట్ వార్నింగ్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో కొనసాగుతున్న వేడిగాలుల కారణంగా నగర రోడ్లపై మధ్యాహ్నం ప్రజల రాకపోకలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ జోన్- టిఎస్‌ఆర్‌టిసి కీలక నిర్ణయం తీసుకుంది.

సిటీలో మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బస్సు కార్యకలాపాలను తగ్గించాలని నిర్ణయించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "వేసవి, మధ్యాహ్నం రోడ్లపై ప్రజల రాకపోకలు విపరీతంగా పడిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని, గ్రేటర్ హైదరాబాద్ జోన్-టిఎస్‌ఆర్‌టిసి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల మధ్య బస్సు కార్యకలాపాలను నిలిపివేస్తుంది" అని టిఎస్‌ఆర్‌టిసి ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వీ వెంకటేశ్వరులు అన్ని రూట్లలో ఉదయం 5 గంటల నుంచి ప్రారంభ ట్రిప్పులు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని రూట్లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సో.. మీ ప్లాన్స్ ఉదయం, సాయంత్రం వేళల్లో పెట్టుకోండి. మధ్యాహ్నం బయటకు వెళ్తే బస్టాపుల్లో పడిగాపులు తప్పకపోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story