Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న అగ్ర నిర్మాత

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న అగ్ర నిర్మాత

తొలిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓ సినీ నిర్మాత మెడకు చుట్టుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని ఎంత హీటెక్కిస్తుందో తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ అధికారులు, పోలీసులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు.

బెదిరింపులు, ధమ్కీలు, కబ్జాలు, ఘోరాలు.. ఎన్నో ఈ ఫోన్ ట్యాపింగ్ ను అడ్డుపెట్టుకుని చేశారనేది అధికార పార్టీ నేతల ఆరోపణ.పుష్ప నిర్మాత నవీన్ యర్నేని పేరును పోలీసులు ఈ కేసులో చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్.. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన దగ్గర ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని కూడా ఉన్నారని తెలపడంతో పోలీసులు నవీన్ పై కేసు నమోదు చేశారు. గతంలో తాను ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జునరావుతోపాటు తన సంస్థలోని నలుగురు డైరక్టర్లు కూడా లబ్ది పొందారని తెలిపారు. వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలశిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావులను ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story