TS : రైతులకూ రూ.15వేలు ఇంకెప్పుడు.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

TS : రైతులకూ రూ.15వేలు ఇంకెప్పుడు.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఫైరయ్యారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ నిరసనకు దిగారు. సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద దీక్షకు దిగారు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నాయకులు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా అమలు చేయలేదని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

రేవంత్ మాటలు నమ్మి రైతులు రుణాలు తీసుకున్నారని.. వ్యవసాయ రుణాలు ఎందుకు మాఫీ కాలేదో వివరించాలని కోరారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఫైరయ్యారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story