రాజధాని రైతులను టెర్రరిస్టుల్లా చూస్తున్నారు: లోకేష్
BY TV5 Telugu9 Jan 2020 10:36 AM GMT

X
TV5 Telugu9 Jan 2020 10:36 AM GMT
రాజధాని గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటిస్తున్నారు. తుళ్లూరులో పర్యటించిన ఆయన అక్కడ రైతులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన ఒక్క చోటే ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన అన్నారు. కానీ, జగన్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని లోకేష్ మండిపడ్డారు. జగన్ ఉద్దేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలంగాణకు తరలించడమేనా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏ రోజూ రాజధాని గ్రామాల్లో ఒక్క ఆందోళన కూడా జరగలేదన్నారు. కానీ, ఇప్పుడు నిత్యం అరెస్టులతో ఈ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ఫైరయ్యారు. రాజధాని గ్రామాల ప్రజలను టెర్రరిస్టుల్లా చూస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story
RELATED STORIES
IBPS Clerk XII Notification 2022: డిగ్రీ అర్హత.. 11 బ్యాంకుల్లో 6035...
2 July 2022 5:38 AM GMTHCL Recruitment 2022 : ఐటీఐ అర్హతతో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో...
1 July 2022 5:20 AM GMTCoal India Recruitment 2022 : డిగ్రీ అర్హతతో కోల్ ఇండియాలో ఉద్యోగాలు..
30 Jun 2022 5:40 AM GMTICF Railway Recruitment 2022: టెన్త్, ఇంటర్ అర్హతతో ఇంటిగ్రల్ కోచ్...
29 Jun 2022 6:30 AM GMTATC Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్...
28 Jun 2022 5:00 AM GMTBIS Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యూరో ఆఫ్ ఇండియన్...
27 Jun 2022 4:46 AM GMT