సీఎం జగన్కు టీడీపీ బహిరంగ లేఖ

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై తెలుగుదేశం పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. ఆర్ధికంగా,సామాజికంగా వెనుకబడిన బీసీలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో టీడీపీ ప్రభుత్వం ఆనాడు 34 శాతం రిజర్వేషన్ అమలు పరిచిందని లేఖలో పేర్కొంది. బాధ్యతా యుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు 34శాతం రిజర్వేషన్లను కాపాడేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హడావుడిగా ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించింది. ఇది బీసీలను రాజకీయంగా అణవేయడమేనని అభిప్రాయపడింది. మీరు తీసుకున్న నిర్ణయంతో 16వేల మంది బీసీలు స్థానిక సంస్థల్లో అధికారానికి దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని.. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎప్పుడైనా తెచ్చుకోవచ్చని అభిప్రాయపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com