ఏపీలో 11కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |27 March 2020 4:55 AM IST
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గురువారం మరోపాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11కి చేరింది. ఈ నెల 18న స్వీడన్ నుంచి.. విజయవాడకు వచ్చిన 28 ఏళ్ల యువకుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతడ్ని విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వారికీ కూడా పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com