మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు

మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం రూ.5 వేలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతపరమైన కార్యక్రమాలు చేస్తున్న వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో వారికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5 వేలు ఇవ్వాలని మంగళవారం ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. గుర్తింపు ఉన్న మసీదుల్లో వారికే కాకుండా.. గుర్తింపు పొందని వారికి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story