సీఎం జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

సీఎం జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ లేఖ

ఫ్రంట్‌లైన్ సైనికులుగా పని చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు.. కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. దురదృష్టవశాత్తు జర్నలిస్టులకు కూడా కరోనా సోకుతుందని.. వారికి బాధ్యత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. విధుల్లో ఉన్న మీడియా సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని కన్నా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులందరికీ రూ.10లక్షలు బీమా సౌకర్యం కల్పించడం ద్వారా హర్యానా ప్రభుత్వం ముందుందని వెల్లడించారు

Tags

Read MoreRead Less
Next Story