ఏపీలో కరోనా విజృంభణ.. ఒకరోజే సుమారు 300 కేసులు

X
By - TV5 Telugu |14 Jun 2020 11:03 PM IST
ఏపీలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు కొత్త కేసులు సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు, విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి మొత్తం 294 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 6,152కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 84 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకూ 2,723 డిశ్చార్జ్ అవ్వగా.. 2,034 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com