జూన్ 22లోపు నన్ను చంపుతామని డెడ్ లైన్ పెట్టారు: బోండా ఉమా

X
By - TV5 Telugu |15 Jun 2020 10:43 PM IST
టీడీపీ నేత బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది టీడీపీ నాయకులను హత్య చేయడానికి పక్కా ప్రణాళిక రచించారని ఆయన ఆరోపించారు. తనను జూన్ 22లోపు చంపుతామని డెడ్లైన్ పెట్టారన్నారు. తనతో పాటు మరికొందరికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న బోండా ఉమ.. మమ్మల్ని చంపడానికి కొన్ని టీంలు ఏర్పడ్డాయని వివరించారు. టీడీపీ నేతలకు ప్రాణహాని కలిగితే సీఎం జగన్దే బాధ్యతని స్పష్టం చేశారు. బెదిరింపులకు లొంగితే వైసీపీ కండువ.. లేకపోతే ఆరెస్టులు.. అదీ సాధ్యం కాకపోతే హత్య చేయించడం.. ఇదే జగన్ మైండ్సెట్ అని బోండా ఉమ తీవ్రంగా విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com