ఏపీలో కొత్తగా వెయ్యి కరోనా కేసులు

X
By - TV5 Telugu |5 July 2020 10:32 PM IST
ఏపీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజే సుమారు వెయ్యి కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 998 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ రోజు నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 961 కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 36 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 18,697కి చేరగా.. 232 మంది మృతి చెందారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com