భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 32,695 కేసులు

X
By - TV5 Telugu |16 July 2020 5:39 PM IST
భారత్లో రోజువారీ నమోదవుతున్న కేసులు రికార్డ్ స్థాయి ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,695 కేసులు నమోదయ్యాయి. అటు, 606మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 9,68,876కి చేరింది. అటు, కరోనా మృతుల సంఖ్య 24,915కి చేరింది. కాగా.. ఇప్పటివరకు మొత్తం 6,12,815 కరోనా నుంచి కోలుకోగా.. 3,31,146 చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 63శాతంగా నమోదవుతుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com