భారత్లో కరోనా కలకలం.. ఒక్కరోజులోనే 857 మంది మృతి

X
By - TV5 Telugu |5 Aug 2020 7:01 PM IST
భారత్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,08,255 కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. ఇప్పటికవరకూ ఈ మహమ్మారి నుంచి కోలుకొని 12,82,216 కోలుకోగా.. 39,795 మంది రోగులు మరణించారు. గడిచిన 24 గంటల్లోనే కరోనా కారణంగా 857 మంది మృతి చెందారు. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com