సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

X
By - TV5 Telugu |11 Aug 2020 4:08 PM IST
ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మొత్తం 9 మంది సీఎంలు ఈ సమావేశంలో పాల్గోనున్నారు. ఏపీ, తెలంగాణ, అస్సోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ చేయనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం గురించి మాట్లాడనున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కరోనా కేసులు, రికవరీ రేటు గురించి చర్చించనున్నారు. అటు, పలు ప్రాంతాల్లో వరదలు కూడా సంభవించడంతో.. వాటిపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com