అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతు అయ్యాడు. స్నేహితులతో కలిసి సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృతి చెందాడు అవినాష్. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. సరస్సు లోతుగా ఉండడం, ఊబి కూడా ఉండడంతో అవినాశ్ గల్లంతయ్యాడని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు అతని స్నేహితులు. అవినాష్ మృతితో వారి కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి.