ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు. సౌతాంప్టన్ వేదికగా మొదలైన పోరులో బూమ్రా ధాటికి సఫారీ ఓపెనర్లు క్రీజులో నిలవలేకపోయారు. బూమ్రా వరుస ఓవర్లలో ఆమ్లా, డికాక్లను ఔట్ చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మరో ఎండ్ నుండి భువనేశ్వర్ కూడా లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేస్తుండడంతో సఫారీ బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు , ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది.