రంజాన్ పర్వదినాన జమ్మూకశ్మీర్లో అల్లరి మూకలు రెచ్చిపోయారు. లోయలో కల్లోలం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్ల దాడికి దిగారు. అల్లరి మూకలను నివారించే ప్రయత్నంలో జవాన్లు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. దీంతో లోయలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హింస చెలరేగడంతో ఘటనా ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో అక్కడ కర్య్ఫూ విధించారు.