Breaking : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా

Update: 2024-05-02 06:01 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది స్పెషల్ కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ పై తీర్పును ఈ నెల 6కు వాయిదా వేశారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు సీబీఐ అధికారులు. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని చెప్పారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని కోర్టుకు వివరించింది సీబీఐ. . ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేయగా.. రిమాండ్‌లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News