అమరావతిలోని సచివాలయంలో అడుగు పెట్టారు ముఖ్యమంత్రి జగన్. పూజలు నిర్వహించి.. ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. వైఎస్సార్కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సచివాలయంలో సందడి నెలకొంది. జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కాబోయే మంత్రులు చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు సచివాలయానికి వచ్చిన కొడాలి నాని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక అంతా మంచే జరుగుతుందని అన్నారాయన.