ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2019-06-09 10:45 GMT

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజకీయం హీటెక్కింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై ఫైరయ్యారు. ఫిరాయింపులపై జగ్గారెడ్డి టీవీ5కి ప్రత్యేకంగా మాట్లాడారు. అసెంబ్లీలో తగినంత సభ్యుల బలం ఉన్నా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేయడమనేది దారుణమన్నారు. కేసీఆర్ నియంత పోకడలు మంచిదికాదని హితవు పలికారు. సభలో ప్రతిపక్షం లేకపోతే ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో అన్నారు.

Similar News