శాసనసభలో టీడీఎల్పీ ఉపనేతలను ఖారారు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు టీడీఎల్పీ ఉప నేతలుగా, వీరాంజనేయస్వామి పార్టీ విప్ గా వ్యవహరిస్తారు. ఇక శాసనమండలిలో టీడీపీ పక్షనేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్, సంధ్యారాణి, గౌరువాని శ్రీనివాసులు ఉంటారు. విప్ గా బుద్దా వెంకన్న, టీడీఎల్పీ ట్రెజరర్ గా మద్దాలి గిరిని నియమించారు.