ఢిల్లీ ఏపీ భవన్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వైసీపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇందులో ప్రత్యేక హోదా, విభజన హామీలు..కేంద్రం నుంచి నిధులు సాధించడంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సమావేశం అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమరస్వామి...వైఎస్ జగన్ ను కలిశారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కుమారస్వామిని సన్మానించారు.