టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె స్టేడియాల్లో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ధోనీ కూతురు జీవా, భారత క్రికెటర్ రిషబ్ పంత్తో కలిసి హల్చల్ చేసింది. టీమ్లో లేకపోవడంతో పంత్ కూడా జీవాతో కలిసి పెద్దగా అరుస్తూ సరదాగా గడిపాడు. పంత్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.