బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు గాయాలు

Update: 2019-06-20 05:25 GMT

హైదరాబాద్‌ జుమ్మెరాత్‌ బజార్‌లో..... రాణి అవంతిభాయ్‌ విగ్రహం ఏర్పాటుపై నిన్న అర్థరాత్రి..... తీవ్ర వివాదం చోటు చేసుకుంది. విగ్రహ ఏర్పాటు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చేయి చేసుకున్నారు పోలీసులు. దీంతో రాజా సింగ్‌కు గాయాలయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు జుమ్మెరాత్‌ బజార్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేఫథ్యంలో అక్కడ భారీగా పోలీసులు ఉన్నారు.

Similar News