వరల్డ్కప్లో అజేయంగా దూసుకుపోతున్న టీమిండియా.. సౌతాంప్టన్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్లో గాయపడ్డ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహమ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చాడు. ఇది మినహా జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. ధావన్ ప్లేస్లో వచ్చిన పంత్ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లాంటి అగ్రశ్రేణి జట్లను ఓడించిన కోహ్లీ సేన.. ఈ మ్యాచ్లో హాట్ ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.