ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకూ అమ్మఒడి పథకం వర్తింపజేస్తామంటూ ఏపీ సీఎంవో స్పష్టతనిచ్చింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా.. అమ్మఒడి పథకం వర్తిస్తుందని పేర్కొంది. అమ్మఒడిలో భాగంగా పిల్లలను స్కూల్కు పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15 వేల రూపాయలు అందించనున్నారు.