గుంటూరు జిల్లా కారంపూడిలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ నాయకుడు షేక్ రషీద్కు చెందిన దాబాని వైసీపీ కార్యకర్తలు కూల్చేసి... రషీద్తో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రషీద్, అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఘటనపై కారంపూడి పోలీసులకు రషీద్ ఫిర్యాదు చేశారు.