విశాఖ టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వకుంటే కూల్చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో డాక్యుమెంట్స్ సమర్పించాలని నగర్ టీడీపీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు.
ఇప్పటికే కృష్ణ కరకట్టపై ప్రజావేదిక అక్రమమంటూ కూల్చడంతో పాటు టీడీపీ అధినేత ఉన్న ఇంటికి నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఈనేపథ్యంలో విశాఖలో అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది.