ఎడ్జ్బాస్టన్ మైదానంలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది. భారత్ ఈ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో అవసరం లేకుండా సెమీఫైనల్కు చేరుతుంది. కీలకమైన ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్లో ఓటమిని దృష్టిలో పెట్టుకుని... స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పింది.. అతని స్థానంలో భువనేశ్వర్కుమార్ కు చోటు కల్పించింది. అటు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ జాదవ్ స్థానంలో.... సీనియర్ దినేష్ కార్తీక్కు చోటు లభించింది. టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న బంగ్లాను నిలువరించాలంటే..ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోరు సాధించాల్సి ఉంది.