మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్తో తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాను అవలంభిస్తున్న టీమిండియా.. కుల్దీప్ యాదవ్ స్థానంలో యజ్వేంద్ర చాహల్కు జట్టులో చోటు కల్పించారు. అటు న్యూజిలాండ్లో సైతం... సీనియర్ పేసర్ సౌథీ స్థానంలో యువ బౌలర్ ఫెర్గూసన్కు చోటు కల్పించారు.