ప్రతిపక్ష పార్టీకి సీఎం జగన్ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. అసెంబ్లీని ఎలా నడపాలో తెలుసుకుంటే మంచిదని సూచించారు.. జగన్ ఎంతసేపు ఆవు కథ చెబుతున్నారే తప్ప అసలు విషయం మాట్లడటం లేదన్నారు. సున్నా వడ్డీపై సీఎం జగన్ సభను పూర్తిగా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు అచ్చెన్నాయుడు.