విద్యార్థులతో కలసి ఐటెమ్‌ సాంగ్‌కు చిందులేసిన ప్రిన్సిపాల్‌

Update: 2019-07-13 14:17 GMT

చిత్తూరు జిల్లాలో డైట్‌ ప్రిన్సిపాల్‌ ఐటమ్‌ సాంగ్‌కు చిందులు వేస్తూ సందడి చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తూ వచ్చిన జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ ఈ నెల 11తో రెండేళ్ల పదవీ కాలం పూర్తైంది. దీంతో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులు, టీచర్లతో కలిసి ఐటెమ్‌ పాటలకు ప్రిన్పిపాల్‌ చిందులు వేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన జిల్లా అధికారులు.. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రంగారెడ్డి నిర్వాకంపై సీరియస్‌ అయ్యారు.

Similar News