ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు త్వరలోనే లక్షా 33 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అటు ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ 1.50 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి రూ. 417 కోట్లు భరించనుంది ప్రభుత్వం.