ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ (81) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 15 ఏళ్లపాటు ఢిల్లీ సీఎంగా పనిచేశారు షీలా దీక్షిత్. 1998 డిసెంబర్ 3 నుంచి 2013 డిసెంబర్ 28 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత కేరళ గవర్నర్గానూ కొనసాగారు. షీలా దీక్షిత్ అసలు పేరు షీలా కపూర్. వినోద్ దీక్షిత్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు షీలా దీక్షిత్గా మారిపోయింది. షీలా దీక్షిత్కు ఇద్దరు సంతానం. ఆమె మృతిపట్ల కాంగ్రెస్ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.