కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కర్ణాటక బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ఎన్నిక లాంచనం కానుంది. ఇవాళ రాత్రి లేదా రేపు యడ్యూరప్ప గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.