కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయి : సీఎం జగన్

Update: 2019-07-25 11:22 GMT

తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత అవసరమని అన్నారు ఏపీ సీఎం జగన్. తెలుగు వాళ్లమంతా ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంపై అభినందించాల్సింది పోయి టీడీపీ నేతలు దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయన్నారు. కలిసి కట్టుగా అడుగులు వేస్తే తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు జగన్.

Similar News