చిత్తూరు జిల్లా మదనపల్లెలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అరుణ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ.. ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. చదువు పేరుతో విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని.. అందువల్లే క్షణికావేశంలో అరుణ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అరుణ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ కీర్తి.. సిద్ధార్థ కాలేజీకి చేరుకున్నారు. విద్యార్థిని మృతిపై విచారణ చేసేందుకు వచ్చిన సబ్కలెక్టర్ను ప్రజా సంఘాలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.