వైసీపీ సర్కార్పై మరో సారి ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్. గత చంద్రబాబు పాలన అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. రక్తం పీల్చేంత అవినీతికి సీఎం జగన్ పెట్టింది పేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానడం లేదన్నారు. ఆరోపణలు మాని పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలుకుతూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు లోకేష్
ఫైబర్ గ్రిడ్పై వైసీపీ నేతల విమర్శలు వింటున్న ప్రజలకు రోత పుడుతోందని విమర్శించారు లోకేష్. టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తే వైసీపీ నేతల కడుపు మండిందన్నారు. అందుకే పథకం ప్రారంభించిన రెండో రోజే కేబుళ్లు కట్ చేశారని దుయ్యబట్టారు. ఫైబర్ గ్రిడ్ను రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు . 5వేల కోట్ల ప్రాజెక్టును 350 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు.. దమ్ముంటే నిరూపించాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు లోకేష్..
రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు. ఆయన్ను పక్కన ఉంచుకుని మా మీద ఆరోపణలు చేస్తే జనం నవ్వుతారు. మీ నేతలా ప్రజల రక్తం పీల్చే దుస్థితిలో నేను లేను...ఆధారాలు చూపించకుండా ఆరోపణలతో బ్రతికేస్తాం అంటే మీ ఇష్టం..
— Lokesh Nara (@naralokesh) July 30, 2019