వరద ఉధృతికి వాగులో ఓ ఆటో కొట్టుకుపోయింది. అయితే.. ప్రాణాలతో బయటపడ్డాడు డ్రైవర్. ఈ ఘటన కొమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. సిర్పూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రాణహిత, పెన్గంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ సమయంలో చింతకుంట దారిలో ఓ ఆటో వరదలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు డ్రైవర్ను రక్షించారు. అటు... వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల రాకపోకలకు నిలిచిపోయాయి.