దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తుపాకీ తూటాల చప్పుళ్లతో దద్దరిల్లింది. ఛత్తీస్ఘడ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్ దళాలు భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్నంద్గావ్ జిల్లా సీతగోటా అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో అగ్ర నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.