నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

Update: 2019-08-11 09:50 GMT

నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. తెలంగాణ మంత్రిజగదీష్‌ రెడ్డి, ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలిసి నీటిని రిలీజ్‌ చేశారు‌. నీటి విడుదల కార్యక్రమానికి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలు సాకారం అవుతున్నాయని అన్నారు తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి. గత ప్రభుత్వం సాగర్‌ నీటి విషయంలో గిల్లి కజ్జాలు పెట్టుకుందన్న ఆయన...మహారాష్ట్ర స్నేహంతో కాళేశ్వరం ఫలాలను చూస్తున్నామని తెలిపారు.

Similar News