మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వస్తుండగా.. రాజీవ్ రహదారిపై.. రెండు కార్లు ఢీ కొన్నాయి. శామీర్ పేట ఎమ్మార్వో ఆఫీస్ ముందుగు జరిగి ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు శామీర్పేట పోలీసులు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. మిగిలిన క్షతగాత్రులను కూడా 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు