TS : పంచింది రేషన్ బియ్యమే.. అయోధ్య రాముడిపై ఒట్టేసి చెప్పాలన్న రేవంత్

Update: 2024-05-06 13:25 GMT

అయోధ్య రాముడినే బీజేపీ నేతలు మోసం చేశారని ఫైరయ్యారు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ నేతలు రేషన్‌ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలు అంటూ పంచారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కాకముందే రేషన్‌ బియ్యానికి పసుపు కలిపి గ్రామాల్లో పంచారని అన్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేశారని, దేవుడిని అడ్డం పెట్టుకునని ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని తుక్కుగూడ రోడ్‌ షోలో రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఊరూరా పంచిన అక్షింతలు అయోధ్య నుంచి తెచ్చినవేనని బీజేపీ నేతలు భద్రాద్రి రాముడి మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్‌ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి దేవుడి పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. మనం హిందువులం కాదా అని, మనం మైసమ్మ, పోచమ్మలకు కోడి కోసినం కల్లు పోసినమన్నారు. వీళ్లు వచ్చి మనకు నేర్పాలా? అని మండిపడ్డారు.

సూరత్‌ నుంచి వచ్చిన మోదీ, అమిత్‌ షా రాజకీయ పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నారని సీఎం ఆరోపించారు. ప్రజల రిజర్వేషన్లను రద్దు చేసి, దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టుపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం తెలంగాణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు.

Tags:    

Similar News