ఒకే దేశం.. ఒకే ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Update: 2019-08-15 03:20 GMT

ఒకే దేశం.. ఒకే ఎన్నికను ఎర్రకోటపై మోదీ మరోసారి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక దేశంలో ఒకే విధానం ఉండాలని, అందుకే తాము దేశం మొత్తం ఒకే పన్ను తీసుకువచ్చామన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దును పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగమని చెప్పారు.

Similar News