దండకారణ్యం కాల్పులతో హోరెత్తిపోతోంది. వరుస ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతున్న దండకారణ్యంలో తాజాగా మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో సోమవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.
చాలాసేపు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో పలువురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. ఈఘటన సలాతోంగ్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా పేలుడు పదార్థులు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భద్రతా దళాలు సెర్చ్ అపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి.
ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఇటీవలే 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా మరో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల వెదుకులాట కొనసాగుతోంది.