తిరుపతిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతునే ఉంది. దీంతో తిరుపతి రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా శీహరి భక్తులు ప్రయాణించే తిరుపతి బస్టాండ్ నుంచి అలిపిరి వరకు రోడ్డు మార్గం మొత్తం వరదనీటితో నిండిపోయింది. నగరంలో చాలా వీధులు వర్షపు నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో హబారీగా నీరు చేరడంతో... స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.