మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మృతి బాధాకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీకి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పుసుపులేటి బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు టీడీపీ అధినేత.