తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు... ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. విపక్ష నేతలు ఆరోపిస్తున్నట్లుగా పీపీఏలు రాత్రికి రాత్రి కుదుర్చుకోవడం సాధ్యం కాదన్నారు. ఇప్పటివరకు ఒకే ఒక్క పీపీఏ కుదుర్చుకున్నామని... అందులో కూడా ధర తక్కువగానే ఉందన్నారు. రాష్ట్ర శ్రేయస్సు, సంస్థల అభివృద్ధిని కాంక్షించే తాము నిర్ణయాలు తీసుకుంటామని.. తమపై ఎవరి ఒత్తిడి లేదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.